Thursday, 10 September 2020

Vishal: ప్రభుత్వం తప్పు చేస్తే ఎలా రియాక్ట్ కావాలో నిరూపించావు.. కంగనాపై విశాల్ సెన్సేషనల్ కామెంట్స్

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం, డ్రగ్స్ కోణాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల తీరును తప్పుబట్టిన ఆమె ముంబై నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని తలపిస్తోందంటూ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనాకు మధ్య వార్ మొదలైంది. కంగనా ఇంటిని, ఆఫీసును బీఎంసి కూల్చే ప్రయత్నం చేయడం లాంటి సంఘటనలతో ఇష్యూ రచ్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్స్ చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టింది కంగనా. తాజాగా దీనిపై రియాక్ట్ అయిన హీరో .. ఆమెను సపోర్ట్ చేస్తూ ఓ సెన్సేషనల్ పోస్ట్ చేశారు. ''డియర్‌ కంగనా.. నీ ధైర్యం, సాహసోపేతమైన నిర్ణయాలకు హ్యాట్సాఫ్. ఏది కరెక్ట్, ఏది తప్పు‌ అనేది ఆలోచించకుండా మీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఓ ప్రభుత్వాన్ని మీరు ఎదుర్కొంటున్న తీరు హర్షణీయం. ఏ మాత్రం వెనుకడుగేయకుండా 1920లో భగత్‌ సింగ్‌ ఎలా అయితే ధైర్యంగా నిలబడ్డాడో అదే ధైర్యంతో మీరు కనిపించారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే.. ప్రజలు ఏ విధంగా ఎదురించొచ్చో నిరూపించారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశానిస్తూ వాక్‌ స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్‌ 19) గుర్తు చేశారు'' అంటూ కంగనాకు తెగ పొగిడేశారు విశాల్. ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: గతంలో కంగనా సంచలన వ్యాఖ్యలతో సంజయ్ రౌత్, శివసేన నాయకులు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబైలో అడుగుపెడితే చెంపేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఏ మాత్రం జంకని కంగనా.. 'సెప్టెంబర్ 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి' అని ముందే ప్రకటించి ముంబై చేరుకుంది. దీంతో కంగనా ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33jf42h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...