సుమారు 50 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు బాలు. ఆయన మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్కి అందించిన .. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నాన్నగారు ఇవాళ (సెప్టెంబర్ 25- శుక్రవారం) స్వర్గీయులయ్యారు. ఆయన కోసం ప్రార్థన చేసిన అందరికీ.. ఎంజీఎం డాక్టర్లకు, స్టాఫ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నాన్న గారు లేకపోయినా ఆయన పాట ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. ఆ పాటే పలకరిస్తుంది. ఆయన మరణించలేదు మీతో మాతో ఆయను ఎప్పుడూ ఉంటారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్. కాగా పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సత్యం థియేటర్ వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే సత్యం థియేటర్ పార్కింగ్ ప్లేస్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి అభిమానులను ఎస్పీ బాలు పార్థివదేహం సందర్శనకు అనుమతించనున్నారు. అనంతరం బాలు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్లో నిర్వహించనున్నట్టు సమాచారం. ఫోటోస్:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S07uEJ
v
No comments:
Post a Comment