కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టయిన హీరోయిన్లు , సంజనా గల్రానీని విచారించిన సీసీబీ పోలీసులు వారిద్దరి కాల్స్డేటా, వాట్సాప్ సందేశాలను సేకరించారు. ఈ డేటా విశ్లేషణ ద్వారా వారిద్దరికి అనేకమంది ప్రముఖులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారం బయటపడిన వెంటనే రాగిణి, సంజన తమ మొబైల్స్లోని డేటాను మొత్తం డిలీట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: తాము సేకరించిన డేటాలో పార్టీల నిర్వహణ, డ్రగ్స్తో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తుల ఫోటోలు, కాల్ రికార్డ్స్ను పోలీసులు సేకరించారు. వీరు జరిపే పార్టీలకు డ్రగ్స్ సేవించే వారిని మాత్రమే అనుమతించేవారని సీసీబీ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాగిణి, సంజనల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగియనుంది. దీంతో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కస్టడీ పొడిగించాలని కోరతారా? లేక జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా? అన్నది సస్పెన్స్గా మారింది. Also Read: పోలీసులు ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండుసార్లు తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. తాజాగా కస్టడీ యుగియనున్న నేపథ్యంలో వారిద్దరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. సంజన డ్రగ్స్ సేవించినట్లు, సరఫరా చేసినట్లు పక్కా ఆధారాలు లభించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసులో పూర్తి అధికారం సీసీబీకి అప్పగిస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZAtdY0
v
No comments:
Post a Comment