బాలీవుడ్ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో పాటు.. ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్, సరోజ్ ఖాన్, రాజన్ సెహగల్ ఇలా బాలీవుడ్ ప్రముఖులు 25 మంది కన్నుమూశారు. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత నేడు (సెప్టెంబర్ 5) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నాళ్లు పాటు ఇంటి దగ్గరే వైద్యం అందించగా.. సెప్టెంబర్ 4 నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో జుహులోని ఆరోగ్య నిధి ఆసుపత్రిలో చేర్పారు. ఆయితే శుక్రవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. నిర్మాతగా దర్శకుడిగా జానీ బక్షి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. మంజిలే ఔర్ భీ హై , రావణ్ , ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ లాంటి హిట్ చిత్రాలను నిర్మించగా.. డాకూ ఔర్ పోలీస్ , ఖుదాయి చిత్రాలకు దర్శకత్వం వహించి అటు నిర్మాతగా.. ఇటు దర్శకుడిగా రాణించారు. జానీ బక్షీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gX9cAI
v
No comments:
Post a Comment