బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఎయిమ్స్ కీలక రిపోర్టను సమర్పించింది. సుశాంత్ శరీరంలో ఎలాంటి విషం లేదని, ఆయన మృతికి ఉరేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. అతడి డీఎన్ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని నివేదికలో పేర్కొంది. తాజా నివేదిక ఆధారంగా సుశాంత్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని డాక్టర్లు భావిస్తున్నారు. Also Read: సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, ఎవరో గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక మలుపులు తిరిగిన ఈ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. రియా చెప్పిన వివరాలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు హీరోయిన్లు రకుల్ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను విచారించారు. Also Read: ఈ క్రమంలోనే ఎయిమ్స్ తన రిపోర్టు సమర్పించడం కీలకంగా మారింది. సుశాంత్ది ముమ్మాటికి ఆత్మహత్యేనని తేలడంతో ఇప్పుడు డ్రగ్స్ కేసుపైనే విచారణ కొనసాగనుంది. మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్ చనిపోయాడని ఆయన ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ జాప్యం చేయడం తగదన్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cEnSEi
v
No comments:
Post a Comment