గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో భారత సంగీత ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన ఇకలేరన్న వార్తను అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. బాలు మృతికి సినీ ప్రముఖలతో పాటు ఇతర రంగాల వారు సంతాపం ప్రకటిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఎందరో తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో వెంటిలేటర్పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేయిస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియోలో బాలు చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తూ కనిపించారు. కొద్ది సేపటి తర్వాత అలసటతో వ్యాయామం ఆపేశారు. వైద్యులు మళ్లీ ఆయనతో చేయించే ప్రయత్నం చేయగా బాలు చేతులు కదపలేక వద్దని వారించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. సుమారు 50 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని చూస్తుండగా గురువారం అనారోగ్యం తిరగబెట్టింది. తీవ్ర జ్వరంతో పాటు ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఎన్ని రకాలుగా చికిత్స చేసినా ఫలించక శుక్రవారం మధ్యాహ్నం ఆయన వెంటిలేటర్పైనే తుదిశ్వాస విడిచారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kOyun2
v
No comments:
Post a Comment