మెగా బ్రదర్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఒక ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘‘బ్యాక్ టు నార్మల్. ఉరుము తరవాత వచ్చే నిశ్శబ్దం.. నాకు నేనుగా బాగున్నాను’’ అని నాగబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు. నాగబాబు ప్రకటనపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనకు కరోనా వైరస్ సోకిందని ఈనెల 16న నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఒక ఇన్ఫెక్షన్ ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మార్చుకోవచ్చు. కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో పోరాడి ప్లాస్మా దాతను కావాలి’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. కానీ, కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేస్తాననే భరోసా ఆయనే స్వయంగా అభిమానులకు కలుగజేశారు. కరోనా సోకినట్టు ప్రకటించిన రోజు నుంచీ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణిస్తే సోషల్ మీడియా ద్వారా నాగబాబు సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు.. తన అన్నయ్య చిరంజీవికి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను గుర్తుచేసుకుంటూ ఒక వీడియో కూడా చేశారు. త్వరలోనే ఆయన ‘అదిరింది’ షూటింగ్లో కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HpnmOT
v
No comments:
Post a Comment