Saturday, 26 September 2020

డ్రగ్స్ చాటింగ్ నిజమే కానీ.. దీపిక సమాధానాలపై ఎన్సీబీ అసంతృప్తి

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ పాత్ర వెలుగులోకి రావడంతో టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరు కాగా.. శనివారం దీపికా పదుకొనేతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ వచ్చారు. ముంబయి కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌‌లో అధికారుల బృందం దీపికను నాలుగు రౌండ్లతో దాదాపు ఐదున్నర గంటల పాటు విచారించారు. డ్రగ్స్‌ కొనుగోలు, సరాఫరా, వినియోగం, పార్టీ వంటి విషయాల్లో దీపిక నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దీపిక ఇచ్చిన సమాధానాలపై ఎన్సీబీ అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కరిష్మా, జయ తదితరులతో డ్రగ్స్ గురించి వాట్సాప్‌ చాటింగ్ చేయడం నిజమేనని ఒప్పుకున్న ఆమె.. కీలక ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. ఐదున్నర గంటల పాటు విచారించినప్పటికీ దీపిక విషయంలో అధికారులు ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. దీంతో ఆమెను మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను వరుసగా రెండోరోజు విచారించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GgS4ZV
v

No comments:

Post a Comment