ప్రముఖ నటుడు మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా టాలీవుడ్లో చెరిగిపోని ముద్ర వేశారు జేపీ. రాయలసీమ యాసలో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. జయప్రకాష్ రెడ్డి హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేపీ మరణాన్ని కళామ్మతల్లి బిడ్డలు జీర్ణించుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జయప్రకాష్ రెడ్డి మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సోషల్ మీడియా ద్వారా జేపీ మృతికి సంతాపం తెలియజేశారు. ఓ మంచి ఆత్మీయుడిని కోల్పోయానని నందమూరి బాలకృష్ణ బాధపడ్డారు. సినీ రంగాన్ని, నాటక రంగాన్ని జేపీ రెండు కళ్లుగా భావించేవారని బాలయ్య కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం. 10 లక్షల రూపాయలను జేపీ కుటుంబానికి బాలయ్య అందజేశారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. Also Read: కాగా, బాలకృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ఫ్యాక్షన్ మూవీ ‘సమరసింహారెడ్డి’ విలన్గా జయప్రకాష్ రెడ్డి ఇమేజ్ను రెట్టింపు చేసింది. ఆ తరవాత ‘నరసింహనాయుడు’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘సీమసింహం’, ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ‘లెజెండ్’, ‘జైసింహా’ సినిమాల్లో జయప్రకాష్ రెడ్డి నటించారు. జేపీ చివరిగా కనిపించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రకాష్ రాజ్కు తండ్రి పాత్రలో నటించారు. ‘కూజాలు చెంబులైతాయ్’ అంటూ ఆయన చెప్పిన డైలాగు నవ్వులు పువ్వులు పూయించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zn7PoT
v
No comments:
Post a Comment