కరోనాతో పోరాడుతూ క్రిటికల్ కండిషన్లో ఉన్న కోలుకున్నారని.. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందంటూ కోట్లాది మంది అభిమానులు ఆనందించే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా వ్యాధితో పోరాడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఆయన క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాతో పంచుకుంటున్నారు ఆయన కుమారుడు . అయితే ఎస్పీ బాలు కోలుకున్నారని.. కరోనా నెగిటివ్ వచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అవన్నీ రూమర్స్ అంటూ వీడియో విడుదల చేశారు చరణ్. తాజాగా వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య బృందాన్ని సంప్రదించిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ హెల్త్ అప్డేట్లను మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ ఈ ఉదయం నుంచి ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. నాన్న ఆరోగ్యం గురించి మొట్టమొదటిగా సమాచారం పొందే ఏకైక వ్యక్తి నేనే. ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. నాన్నగారికి కొవిడ్ నెగటివ్ వచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కరోనా నెగటివా? పాజిటివా? అన్న విషయం పక్కన పెడితే, ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ ఆయనకు వైద్యులు వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇది ఇలాగే ఉంటే, ఆయన ఊపిరితిత్తులు మరింత కోలుకునే అవకాశం ఉంది. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్డేట్ ఇస్తా. ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ElPp0r
v
No comments:
Post a Comment