కరోనా బారిన పడిన లెజెండరీ సింగర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. తాజాగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందిస్తూ కరోనా నుంచి బాలు కోలుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, తాజాగా చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ అని వచ్చిందని ఆయన చెప్పారు. ఈ గుడ్ న్యూస్ తెలియడంతో అశేష సినీ లోకంలో ఆనందం చిగురించింది. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్తో పాటు ఈసీఎంవో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్తో చికిత్స చేస్తున్నారు. Also Read: అయితే గత కొద్దిరోజులుగా బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని హెల్త్ బులెటిన్స్ రిలీజ్ కావడంతో యావత్ సినీ లోకం ఆందోళన చెందింది. బాలు సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఎవరికివారు పెద్ద ఎత్తున ప్రార్ధనలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ చరణ్ చెప్పిన ఈ న్యూస్తో అంతా తేరుకున్నారు. బాలు అభిమానులు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ytjpyk
v
No comments:
Post a Comment