బాలీవుడ్ నటుడు విచారణ వేగంగా జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రంగంలోకి దిగిన ఈడీ, సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఉన్న అనుమానాలకు రెక్కలు కడుతున్నాయి. సుశాంత్ సూసైడ్ మిస్టరీలో ఇప్పటికే ఆయనతో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో ఆమె డ్రగ్స్ డీలర్లతో చేసిన వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది. సుశాంత్ మరణానికి ముందు రియా చేసిన కాల్స్, వాట్సాప్ డాటా పరిశీలించిన ఈడీ అధికారులకు.. ఆమె డ్రగ్ డీలర్లతో సంప్రదింపులు జరిపిన సందేశాలు లభ్యమయ్యాయి. డ్రగ్ డీలర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాట్ చేసింది. డ్రగ్స్ విషయమై 2017 మార్చి నుంచి గౌరవ్తో రియా కాంటాక్ట్లో ఉన్నట్లు తేలడం షాకిస్తోంది. అంతేగాక అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మిథిలీన్ డయాక్సీ మెథాంఫేటమిన్ గురించి ఆమె ఆరా దీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. Also Read: ఇదేగాక సుశాంత్ పర్సనల్ సిబ్బంది శామ్యూల్ మిరాండాతో రియా జరిపిన మరో మెసేజ్ వైరల్ అవుతోంది. హాయ్ రియా.. డ్రగ్స్ (స్టఫ్) ఏమి మిగల్లేవు అంటూ వారి మధ్య సంభాషణ జరగడం మిస్టరీని తలపిస్తోంది. ఈ మొత్తం ఆధారాలను మంగళవారం రోజు సీబీఐకి అప్పగించారు ఈడీ అధికారులు. దీంతో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. త్వరలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేసి ఫైనల్గా విచారణ చేపట్టనున్నారని తెలుస్తోంది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు, లాప్టాప్స్ ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31tPPuz
v
No comments:
Post a Comment