బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తాలూకు చేదు జ్ఞాపకాలు మరవకముందే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వరుస విషాద వార్తలు వినిపిస్తుండటం యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతోంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట సినీ ఇండస్ట్రీకి చెందిన వారి మరణ వార్త వినాల్సివస్తుండటం తీవ్ర విషాదంలో ముంచెత్తుతోంది. నిన్న (గురువారం) ముంబైలో యువ నటుడు సమీర్ శర్మ ఆత్మహత్య వార్త విన్నాం. అందులో నుంచి తేరుకోకముందే మరో సినీ, టీవీ నటి (40) ఆత్మహత్య వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో భోజ్పురి నటి అనుపమ పాథక్ ఆగస్టు 2న తన దాహిసర్ ఈస్ట్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారనే వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక విచారణలో భాగంగా ఇది ప్రమాదవ శాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి.. ఇప్పుడు ఆ కేసుని ఐపిసి సెక్షన్ 306కి (ఆత్మహత్య కేసుగా) మార్చారు. Also Read: కాగా తన మరణానికి ఒకరోజు ముందు సామాజిక మాధ్యమాల్లో అనుపమ పాథక్ పెట్టిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది. ''అందరికీ విశ్వాస పాత్రులుగా ఉండండి కానీ.. ఎవరినీ నమ్మకండి. అదే చేసి నేను మోసపోయాను.. ఇది నా జీవితంలో నేర్చుకున్న పాఠం. ప్రజలు చాలా స్వార్థపరులు ఇతరులను పట్టించుకోరు'' అని పేర్కొంటూ మరణానికి ముందు రోజు ఆమె ఆవేదన చెందింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DDOCaL
v
No comments:
Post a Comment