ప్రముఖ సినీ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే తన 18వ వివాహ వార్షికోత్సవాన్ని శుక్రవారం విజయవాడలో జరుపుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త సెల్వమణితో సహా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. రోజా, సెల్వమణి వెంట పిల్లలు అన్షుమాళిక, కృష్ణ లోహిత్ కూడా ఉన్నారు. తమ పెళ్లిరోజున రోజా సెల్వమణి దంపతులు జగన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. రోజా వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచీ ప్రతి ఏటా వివాహ వార్షికోత్సవం నాడు జగన్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కాగా, తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా జగన్ను కలిసిన విషయాన్ని రోజా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జగన్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలను కూడా ట్వీట్లో పొందుపరిచారు. ‘‘వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా జగనన్నను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం సంతోషంగా ఉంది’’ అని రోజా పేర్కొన్నారు. కాగా, తనను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఆర్కే సెల్వమణినే రోజా వివాహం చేసుకున్నారు. 2002 ఆగస్టు 21న రోజా, సెల్వమణి వివాహం జరిగింది. ప్రశాంత్ హీరోగా సెల్వమణి దర్శకత్వంలో 1992లో వచ్చిన ‘చెంబరుతి’ సినిమా ద్వారా రోజా కోలీవుడ్కు పరిచయమయ్యారు. ఈ సినిమాకు ‘చామంతి’ పేరుతో తెలుగులో అనువాదం చేశారు. ఈ సినిమా షూటింగ్ భీమిలి బీచ్లో జరిగింది. ఈ భీమిలి బీచ్లోనే తన భర్త సెల్వమణి తనకు ఐ లవ్ యు చెప్పారని గతంలో రోజా చెప్పారు. 12 ఏళ్లపాటు ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నామని వెల్లడించారు. Also Read: ఇదిలా ఉంటే, సినిమాల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించారు రోజా. చిత్తూరు జిల్లాకు చెందిన రోజా.. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. అయితే, టీడీపీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని భావించి అదే ఏడాది వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j3tXfC
v
No comments:
Post a Comment