Thursday, 27 August 2020

కరోనా బాధితులకు అండగా పవన్ కళ్యాణ్ సేన.. పుట్టినరోజు వేడుకలకు దూరం

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ జన్మదిన వారోత్సవాలను జనసైనికులు మొదలుపెట్టారు. జనసేనాని పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోకి కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్‌తో కూడిన యూనిట్లను అందజేస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి నుంచి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, నార్మల్‌ వెంటిలేటర్‌‌‌తో కూడిన యూనిట్లను జనసేన పార్టీ శ్రేణులు పంపిణీ చేశాయి. 13 జిల్లాల్లో మొత్తం 335 యూనిట్లను జనసేన పార్టీ సమకూర్చింది. గురువారం ఆయా జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రులకు ఈ యూనిట్లను అందచేశాయి. విపత్కర పరిస్థితుల్లో వేడుకలకు దూరంగా... కోవిడ్‌ బాధితులకు అండగా ఉంటాం అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆయా జిల్లాల పార్టీ నాయకులు, జనసేన శ్రేణులతో పాటు ఎన్‌.ఆర్‌.ఐ. జనసేన విభాగం, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న జనసైనికులు కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ యూనిట్లు డొనేట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం కోవిడ్‌‌తో మృతి చెందిన వారికి రూ. 15 వేల పరిహారం ఇస్తే.. తాము కోవిడ్‌ బాధితులను బతికించేందుకు రూ. 10 వేలతో ప్రాణవాయువును అందిస్తామంటూ జనసేన నాయకులు నినదించారు. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. Also Read: కృష్ణా జిల్లాలో 45 ఆక్సిజన్‌ సిలిండర్లు, నార్మల్‌ వెంటిలేటర్‌‌తో కూడిన కిట్లను అందచేశారు. అందులో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 31, మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి 9, పెడన, నూజివీడు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రెండు చొప్పున, అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలోని ఆసుపత్రికి ఒకటి అందచేశారు. గుంటూరు జిల్లాలో మొత్తం 18 యూనిట్లు సమీకరించారు. జీజీహెచ్‌‌కి 14, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి 4 యూనిట్లు అందచేశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నేతలు ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి 25 యూనిట్లు డొనేట్‌ చేశారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మొత్తం 21 యూనిట్లు సమకూర్చారు. అందులో జిల్లా పెద్దాసుపత్రికి 18 యూనిట్లు, పోలీస్‌ ఆసుపత్రికి 3 యూనిట్లు అందచేశారు. చిత్తూరు జిల్లా నుంచి మొత్తం 26 యూనిట్లకుగాను తిరుపతి రుయా ఆసుపత్రికి 23, శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి 3 యూనిట్లు చొప్పున జనసేన నాయకులు అందచేశారు. కడప రిమ్స్‌‌కు 21 యూనిట్లను జనసేన పార్టీ సమకూర్చింది. కర్నూలు జిల్లా కేంద్రంలోని రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రికి 40 ఆక్సిజన్‌ సిలిండర్లతో కూడిన యూనిట్లు జనసేన పార్టీ తరఫున జనసేన-బీజేపీ నాయుకులు అందించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 15 యూనిట్లు పార్టీ నేతలు ఇచ్చారు. శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పతికి 12 యూనిట్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌‌కు అందించారు. విజయనగరంలో మహారాజ ప్రభుత్వ ఆస్పత్రికి 19, విశాఖపట్నంలో విమ్స్‌ ఆస్పత్రికి 21, కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 20, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి 6, అమలాపురం ప్రభుత్వాసుపత్రికి 11, ఏలూరు ప్రభుత్వాసుపత్రికి 35 యూనిట్లను జనసేన పార్టీ సమకూర్చింది. ఆయా ఆసుపత్రుల సూపరిండెంట్లు, మెడికల్‌ ఆఫీసర్లకు ఈ యూనిట్లను అప్పగించారు’’ అని తమ ప్రకటనలో జనసేన పార్టీ పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b1leaN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...