అభిమానుల ప్రార్ధనలు ఫలిస్తున్నాయి.. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా నుంచి కోలుకుంటున్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్లో చికిత్స పొందుతున్న బాలు.. మెల్లగా కోలుకుంటున్నారు. నిన్నటి కంటే కూడా ఆయన ఆరోగ్యం మరింత మెరుగైనట్టు తెలిపారు ఆయన కుమారుడు . ప్రతిరోజు ఆరోగ్య పరిస్థితిపై వీడియో విడుదల చేస్తున్న ఎస్పీ చరణ్.. బుధవారం నాడు బాలు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల పాటు విషమ పరిస్థితిని ఎదుర్కొన్న ఎస్పీ బాలు.. గత మూడు రోజులుగా ట్రీట్మెంట్కి సహకరిస్తుండటంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు కోట్లాది మంది సంగీత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం నాడు బాలు క్షేమ పరిస్థితిని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్లో వీడియో విడుదల చేశారు ఎస్పీ చరణ్. ఆయన మాట్లాడుతూ ‘నిన్నటికంటే ఈరోజు నాన్నగారి ఆరోగ్యం మొరుగైంది. ఆయన పూర్తి స్పృహలోకి వచ్చారు. చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారు. మరో వారంలో కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్పీ చరణ్. ఈ సందర్భంగా ఎస్పీ బాలు తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నించారని.. రాసి చూపించేందుకు ప్రయత్నించి రాయలేకపోయారని అన్నారు. అలాగే ఆయనకు ఇష్టమైన పాటల్ని వింటున్నారని.. ఆ పాటకు తగ్గట్టుగా తాళం వేసేందుకు పాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు చరణ్. ప్రతిరోజు పేపర్ చదివి నాన్నకు వినిపించాల్సిందిగా డాక్టర్లను కోరినట్టు తెలిపారు చరణ్. నాన్న ఆరోగ్యం కోసం ఎంతో మంది నిరంతరం ప్రార్ధనలు చేస్తున్నారని.. అలాగే ఎంజీఎం వైద్యులు ఎంతో శ్రమిస్తున్నారని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలను తెలిపారు ఎస్పీ చరణ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31sHuaC
v
No comments:
Post a Comment