Tuesday, 25 August 2020

ఎక్స్‌క్లూజివ్.. బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్? చిరుతో భేటీ వెనుక మర్మం.. క్లూ ఇచ్చేసిన బడా బాస్

రాజ్యానికి రాజు మారాక.. ప్రజల జీవితాలు మారతాయా.. లేదా? అన్న విషయం తరువాత కాని.. ఎంతో కొంత మార్పు ఉంటుందనే ఆశ మాత్రం అటు రాజ్యాధినేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఉండనే ఉంటుంది. దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తుంటే.. ఏపీ ప్రజలు మాత్రం ఆ పార్టీని ఇంకా మతమరమైన పార్టీగానే చూస్తున్నారు. మోడీ అడిగితే చప్పట్లు కొడుతున్నారు తప్పితే ఓట్లు మాత్రం రాల్చడం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లు సంఖ్య గుండు సున్నాని బట్టి ఏపీ ప్రజల్లో బీజేపీపై ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ కాంగ్రెస్‌ మాత్రం సెంచరీ కొట్టిందా? అది కూడా ఖాతా తెరవలేదు కదా అంటే.. నిజమే కాని.. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కి ఆ గతి పట్టింది కాని.. అంతకు ముందు ఏపీలో కాంగ్రెస్‌కి బలమైన ఓటు బ్యాంక్ ఉండేది. అయితే ఈ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టాలంటే.. ఢిల్లీ నుంచి మోడీ అండదండలతో పాటు పార్టీని నడిపించగలిగే సమర్ధవంతమైన నాయకత్వం ఉండాలి. కన్నా లక్ష్మీనారాయణ లాంటి ప్రజా బలం లేని (ప్రస్తుతం) నాయకుడ్ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని పార్టీని విజయపథంలో నడిపించడం అనేది కలే. అందుకే 2024 ఎన్నికల ఎన్నికలకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీతో మైత్రి వల్ల లాభం లేదనుకున్న బీజేపీ ఓటు బ్యాంక్‌పై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా సోము వీర్రాజుని రాష్ట్రానికి కొత్త బాస్‌గా ప్రకటించారు. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి సోము వీర్రాజుకి కూడా మాస్ ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ కూడా.. ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు, భేటీలు బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అధినేతతో భేటీ.. బీజేపీ- జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగాలని.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిశ్చయించారు. ఇక ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితోనూ భేటీ అయ్యారు సోము వీర్రాజు. 2024 ఎన్నికలు లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడానికే ప్రముఖుల్ని కలుస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు సోము వీర్రాజు. నిజానికి 2019 ఎన్నికల తరువాత జగన్.. సంక్షేమ పథకాల అమలులో దూకుడు చూపిస్తూ అంతకంతకూ బలంగా మారుతున్నారనేది వాస్తవం. ఇదే దూకుడు 2024 వరకూ చూపిస్తే మళ్లీ జగన్ సీఎం అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ బలహీనపడిందని గత ఎన్నికల్లో తేటతెల్లమైంది. మరి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారన్నది చూడాల్సి ఉంది. ఇకపోతే.. జనసేనతో బీజేపీ మైత్రి.. మెగా హీరోలతో భేటీ వెనుక వ్యూహంపై ఓపెన్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇప్పటికే తమ మిత్రపక్షం అని ప్రకటించిన బీజేపీ.. పవన్ కళ్యాణ్‌కి రాబోయే కాలంలో ఒక కీలకమైన బాధ్యతను కేంద్రం అప్పగించే అవకాశం ఉన్నట్టుగా వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సోము వీర్రాజు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తనకు బాధ్యతలు కావాలని అడిగే వ్యక్తి కాదు.. అసలు వారి స్వభావమే అది కాదు. కాని రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావిత వ్యక్తి పవన్ కళ్యాణ్.. అలాగే వారి ఆలోచనలు, మోడీ గారి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. మోడీ ఇజం-పవనిజం రెండింటినీ కలిపి స్ట్రాంగ్ ఫోర్స్‌గా తయారుచేయబోతున్నాం. ఆయనతో కలిసి రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నా ఇందులో రెండో ఆలోచన లేదు. ఇప్పుడు ఆయనకు కేంద్రంలో కీలకమైన బాధ్యతని ఇచ్చి.. ఆ తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేది మా ఎజెండాలో ఉన్న అంశమా అంటే.. మా వ్యూహాల్లో ఎన్నైనా ఉంటాయి. అవన్నీ ఇప్పుడే చెప్పము. చెప్పవలసినప్పుడు చెప్తాం.. పెద్దలంతా కూర్చుని ఏం చేయాలో అది చేస్తారు. ఒకవేళ పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిసైట్ చేస్తే ఆ విధంగానే ముందుకు వెళ్తాం’ అని కుండబద్దలు కొట్టేశారు సోము వీర్రాజు. ఈలెక్కన ఆయన అధ్యక్షుడైన తరువాత పవన్‌తో జరిపిన భేటీలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పకనే చెప్పారు. ఇక మెగాస్టార్‌ విషయానికి వస్తే.. తమ్ముడు కంటే అన్న కాస్త సీనియర్. ఏ రకంగా చూసుకున్నా పవన్ రాజకీయ వ్యూహాలకంటే కూడా చిరంజీవి రాజకీయ వ్యూహాలే ఎక్కువ ఫలించాయని చెప్పొచ్చు. పవన్‌కి జనసేన పార్టీ ద్వారా ఒకే ఒక్క సీటు మాత్రమే వస్తే.. చిరంజీవి తాను గెలివడమే కాకుండా.. 18 సీట్లను గెలిపించుకోగలిగారు. ఆ తరువాత కేంద్ర మంత్రిగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇక చిరంజీవితో భేటీ వెనుక వ్యూహాన్ని బహిర్గతం చేశారు సోము వీర్రాజు. ఈయన అధ్యక్షుడు అయిన తరువాత నేరుగా మెగాస్టార్‌ని కలిశారు. చిరంజీవి బీజేపీ పార్టీలో చేరబోతున్నారంటూ చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఇంతకీ సోము వీర్రాజు.. చిరంజీవితో జరిపిన భేటీలో బీజేపీలో చేరమని అడిగారా? అంటే పార్టీ స్ట్రాటజీ ప్రకారం ఏదైనా జరగొచ్చు. రాజకీయాల్లో కొన్ని బంధాల్ని అనుబంధాల్ని కొనసాగించాలి. రిలేషన్స్ పెంచుకోవాలి. రాజకీయాల్లో రేపు ఏం చేయబోతున్నామో ఈరోజే చెప్పం. క్రికెట్‌లో ఏది సిక్సో.. ఏది ఫోరో కొడితేనే కాని తెలియదు. మా పాలిట్రిక్స్ కూడా అంతే. ఇది కూడా ఒకరకమైన క్రికెట్టే.. భారతీయ జనతా పార్టీకి ఒక్కశాతం మాత్రమే ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు.. కాని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నతుంది ఈ పార్టీనే. ఇవన్నీ రాసిపెట్టుకోవాల్సిన విషయాలు’ అంటూ ఏపీ రాజకీయాలు.. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సోము వీర్రాజు. Read Also: Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32rCKBr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...