సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరవాత ఆయన ఫ్యాన్స్ చాలా మంది రియా చక్రవర్తిపై శత్రుత్వం పెంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సుశాంత్ ఫ్యాన్స్ ఆయన ప్రియురాలు రియాపై అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారానే కాకుండా ఆమెకు నేరుగా ఫోన్ చేసి దూషించే ప్రయత్నం చేశారు. కానీ, నంబర్ అనుకొని ముంబైకి చెందిన 32 ఏళ్ల ఓ వ్యక్తికి ఫోన్ చేసి బూతులు తిట్టారు కొంత మంది సుశాంత్ ఫ్యాన్స్. ఆ వ్యక్తి ఏకంగా సుమారు 150 నంబర్లను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ముంబై మిర్రర్ రిపోర్ట్ ప్రకారం, ముంబైకి చెందిన సాగర్ సర్వే ఓ విద్యా సంస్థలో క్లర్క్గా పనిచేస్తున్నారు. ఆయన ఫోన్ నంబర్కు, రియా చక్రవర్తి నంబర్కు ఒక్క డిజిట్ మాత్రమే తేడా. ఈ తేడా ఆయన కొంప ముంచింది. గడిచిన వారం రోజులుగా సాగర్కు చాలా మంది ఫోన్ చేసి రియా చక్రవర్తి అనుకొని అసభ్యకర పదజాలంతో దూషించారు. వాళ్ల టార్చర్ తట్టుకోలేక నంబర్లు బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. ఇలా తాను 150 నంబర్లు బ్లాక్ చేసినట్టు సాగర్ చెప్పారు. అయినా కాల్స్ ఆగకపోవడంతో తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశారు. Also Read: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి వెనుక ప్రియురాలు రియా చక్రవర్తి పాత్ర ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తో్న్న విషయం తెలిసిందే. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బిహార్ నుంచి కొంత మంది సుశాంత్ ఫ్యాన్స్ రియాను టార్గెట్ చేస్తున్నారు. తనకు ఫోన్ చేసి రియా ఉందా అని అడుగుతున్నారని, రాంగ్ నంబర్ అని చెప్పినా వినకుండా తిడుతున్నారని సాగర్ వాపోయారు. ఆఖరికి వాట్సాప్లో వీడియో కాల్స్ చేసి సైతం తిడుతున్నారని చెప్పారు. అయితే, టీవీ ఛానెళ్లలో రియా చక్రవర్తి మొబైల్ నంబర్ను చూపిస్తున్నారని తన స్నేహితుడు తనకు చెప్పాడని.. కానీ, ఆ నంబర్ తనదని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించానని సాగర్ వెల్లడించారు. కేసు పెట్టేకన్నా నంబర్ మార్చుకోమని పోలీసులు సలహా ఇచ్చారని తెలిపారు. దీంతో తాను నంబర్ మార్చేశానని చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XQvUDJ
v
No comments:
Post a Comment