సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ప్లాస్మా దాతలకు సత్కార కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ కూడా పక్కనే ఉన్నారు. చిరు మాట్లాడుతున్న సమయంలో మధ్యలో కాస్త దగ్గుతో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఉన్న పోలీస్ అధికారి నీళ్లు అందించారు. ఈ సందర్భంగా చిరు కాస్త చమత్కరించారు. ‘‘కరోనా సమయంలో ఎవరైనా దగ్గితే భయం వేస్తోంది. ఇప్పుడు నేను దగ్గుతున్నానని భయపడకండి’’ అని అందర్నీ ఉద్దేశించి మాట్లాడారు. దీంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా నవ్వారు. చిన్న దగ్గు దగ్గినా, ఎలర్జీతో తుమ్ములు వచ్చినా పక్కన వాళ్లు దూరం జరిగిపోతున్నారని చిరు వ్యాఖ్యానించారు. ఖర్మ అంటూ తమ ఇంట్లో పరిస్థితిని తెలిపారు. ఇంటికి వెళ్లి తన శ్రీమతి సురేఖపై సరదాగా చెయ్యి వేసినా.. తను కూడా దూరం జరిగిపోతోందంటూ హాస్యాన్ని పండించారు. అందరి మధ్యా భౌతిక దూరం ఉండొచ్చు కానీ.. భార్యాభర్తల మధ్య కూడా ఉండాల్సి వస్తోందని చమత్కరించారు. దీంతో అక్కడున్న వారంతా మరోసారి ఫక్కున నవ్వారు. Must Read: మరోవైపు, సీపీ సజ్జనార్ను చిరు పొగడ్తలతో ముంచెత్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సజ్జనార్ పలువురి ప్రశంసలు అందుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇకపై పోలీసులు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేపట్టినా తనను వినియోగించుకోవాలని సజ్జనార్ను చిరు కోరారు. ‘‘మా ఇంట్లో పని చేసే వారికి నలుగురికి కరోనా సోకింది. వంట మనిషి శ్రీను, స్విమ్మింగ్ లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరికి సోకింది. ఇప్పుడు వారందరు కోవిడ్ నుంచి కోలుకుని పనిలో చేరారు. వాళ్ల ప్లాస్మా ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇంట్లో అందరూ భౌతిక దూరం పాటిస్తున్నాం. ఫిజికల్ డిస్టెన్స్ అనేది భార్యాభర్తలను కూడా విడదీసింది. కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ప్లాస్మా దానం చేయండి. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్లాస్మానే మనల్ని కాపాడుతుంది’’అని చిరు సూచించారు. Also Read: ;
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kooeCo
v
No comments:
Post a Comment