Friday, 24 July 2020

Sushmita Konidela: నిరాశ చెందిన చిరంజీవి కూతురు.. ఇక దూరంగా ఉండాలని ఫిక్స్! కారణమిదే..

కరోనా కారణంగా మెగాస్టార్ పెద్ద కూతురు కాస్త నిరాశ చెందిందని తెలుస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిగ్రీ పొందిన ఆమె.. పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తోంది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఇటీవలే నిర్మాతగా మారింది. ఈ మేరకు 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభించేసింది. ఈ వెబ్ సిరీస్ ఓపెనింగ్‌కు ఆమె తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి కొణిదెల సురేఖ హాజరై ఆశీర్వదించారు. ఇక ఆ రోజు నుంచి తన ఫుల్ ఫోకస్ ఈ వెబ్ సిరీస్ పైనే పెట్టిన సుస్మిత.. చకచకా షూటింగ్ పనులు కానిచ్చేస్తోంది. కానీ ఉన్నట్లుండి షూటింగ్ ఆపాల్సిన పరిస్థితి రావడంతో నిరాశ చెందుతోందట సుస్మిత. కరోనా కారణంగా సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌కి బ్రేకులు పడ్డాయి. ఆమె టీమ్‌లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే అతనితో క్లోజ్‌గా మూవ్ అయిన అందరికీ కరోనా టెస్ట్‌లు చేయించి, అందరినీ 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కోరిందట సుస్మిత. అంతేకాదు ఇక ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేయకుండా కొన్నిరోజులు దూరంగా ఉండటమే మంచిదని డిసైడ్ అయిందట. Also Read: కాగా తల్లిదండ్రుల సహకారంతో ఎంతో ఉత్సాహంగా, కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నా కూడా.. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో సుస్మిత మనసు గాయపడిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఏదేమైనా కాస్త గ్యాప్ తీసుకోనైనా షూట్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందుతానని అంటోందట సుస్మిత. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Rqlsf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...