Sunday, 26 July 2020

Mahesh Bhatt: సుశాంత్ ఆత్మహత్యపై కొనసాగుతున్న సస్పెన్స్.. విచారణకు మహేశ్​ భట్

బాలీవుడ్‌ని షేక్ చేసింది. ఎంతో టాలెంట్‌, మంచి భవిష్యత్ ఉన్న ఆ యువనటుడు బలవన్మరణానికి పాల్పడేంత పిరికివాడు కాదని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తుండటంతో ముంబై పోలీసులు ఈ సూసైడ్ కేసు విచారణ వేగ‌వంతం చేశారు. ఈ క్రమంలోనే డైరెక్ట‌ర్ సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు. ఇక ఇప్పుడు ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేశ్ భట్ వాంగ్మూలాన్ని కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మహత్య కేసు విషయమై మరో రెండు రోజుల్లో మ‌హేశ్ భట్‌ని కూడా పోలీసులు విచారించనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్ల‌డించారు. ఆయనతో పాటు కరణ్ జోహర్ మేనేజర్నూ విచారణకు పిలిచినట్లు ఆయన తెలిపారు. మరోవైపు సుశాంత్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న‌ నటి కంగనా రనౌత్కూ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: గత నెల 14న తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఆత్మహత్య కాదు హత్య అని సుశాంత్ సన్నిహిత వర్గాలు ఆరోపించినప్పటికీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆత్మహత్య అని తేలడంతో.. ఎంతో కెరీర్ ఉన్న అతను ఇలా సూసైడ్ చేసుకోవడానికి కారణాలేంటి? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మిస్టరీ చెందించే దిశగా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WYTWMK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...