హీరో పెళ్లికి జనసేన అధినేత, పవర్ స్టార్ హాజరవుతారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్తో పాటు వరుణ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్కు నితిన్ ఆహ్వానం అందిందని.. వీరంతా హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే పెళ్లికి హాజరవుతారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే, పెళ్లి కన్నా ముందే నితిన్ను తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఆశీర్వదించారు. నితిన్ను పెళ్లికొడుకును చేసిన వేడుకలో పవన్ కళ్యాణ్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) పాల్గొన్నారు. ఈనెల 26న కందుకూరిని నితిన్ పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఫలక్నుమా ప్యాలెస్లో నితిన్-షాలినీల వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకు చాలా తక్కువ మంది హాజరుకానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే పెళ్లికి హాజరుకానున్నారు. Also Read: ఇదిలా ఉంటే, నితిన్-షాలిని నిశ్చితార్థ వేడుకతో ప్రీ వెడ్డింగ్ హంగామా మొదలైంది. బుధవారం నితిన్, షాలిని ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కొని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక గురువారం మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇదే రోజు నితిన్ను పెళ్లికొడుకును కూడా చేశారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పాల్గొన్నారు. నితిన్ను ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చినబాబుతో కలిసి నితిన్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష వస్త్రధారణతోనే నితిన్ పెళ్లికొడుకు వేడుకకు పవన్ హాజరయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OSdwpd
v
No comments:
Post a Comment