Tuesday, 28 July 2020

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సినిమా.. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కు అనుబంధంగా స్థాపించిన స్వప్న సినిమా త‌న భారీ త్రిభాషా చిత్రాన్ని మంగ‌ళ‌వారం ప్రక‌టించింది. ఇందులో మలయాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్ హీరోగా న‌టించ‌నున్నారు. 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేయ‌నున్నారు. వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది. జూలై 28న దుల్కర్ స‌ల్మాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అంద‌మైన టెలిగ్రామ్ నేప‌థ్యంలో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సిల్హౌట్ ఇమేజ్‌లో దుల్కర్ ఒక ఆర్మీ‌ మేన్‌గా క‌నిపిస్తుండ‌గా, రెండు చేతులు క‌లుసుకున్నట్లు ఉన్న ఇమేజ్.. సినిమాలోని ప్రేమను ప్రతిబింబిస్తోంది. అంతేకాదు, పోస్టర్‌లో ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. Also Read: తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందనున్న ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ స‌ల్మాన్ కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్‌ను స్వప్న సినిమా బ్యాన‌ర్‌పై ప్రియాంకా ద‌త్ నిర్మిస్తుండ‌గా, వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్పిస్తోంది. కాగా, వైజయంతీ మూవీస్ ఇప్పటికే ప్రభాస్‌, దీపికా ప‌దుకొనె కాంబినేష‌న్‌లో సినిమాను ప్రకటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో పాటు నందినీరెడ్డి ద‌ర్శక‌త్వంలో మ‌రో చిత్రాన్ని కూడా వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నుంది. మ‌రోవైపు ‘జాతిర‌త్నాలు’ చిత్రం ముగింపు ద‌శ‌కు వచ్చింది. దుల్కర్ స‌ల్మాన్‌, వైజ‌యంతీ మూవీస్ కాంబినేష‌న్‌లో ఇప్పటికే ‘మ‌హాన‌టి’ వంటి బ్లాక్‌బ‌స్టర్ బ‌యోపిక్ వ‌చ్చింది. దుల్కర్ మునుప‌టి చిత్రం ‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో విడుద‌లై మంచి విజయాన్ని అందుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f6jmhq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...