Friday, 24 July 2020

నితిన్ ఇంట ప్రీ వెడ్డింగ్ హంగామా.. సందడిగా మెహందీ ఫంక్షన్

హీరో నితిన్, కందుకూరి వివాహం ఈనెల 26న హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. వధూవరుల ఇంట ఇప్పటికే పెళ్లి సందడి మొదలైపోయింది. బుధవారం నితిన్, షాలిని నిశ్చితార్థ వేడుకను నిర్వహించగా.. గురువారం మెహందీ ఫంక్షన్‌ను సందడిగా నిర్వహించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించి షాలినీకి ఉంగరం తొడుగుతున్న ఫొటోను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, మెహందీ ఫంక్షన్ ఫొటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లో నితిన్ నీలం రంగు కుర్తాలో మెరిసిపోతుండగా.. షాలిని ఎరుపు రంగు లెహెంగా వేసుకుని, డైమండ్ నెక్‌లేస్ ధరించి దేవతలా కనిపిస్తున్నారు. షాలినీతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నీరజ కోన.. మిగిలిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టుకున్నారు. కాగా, ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో పెళ్లి వేడుకను చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో జరపనున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, కొంత మంది స్నేహితులు మాత్రమే నితిన్-షాలిని పెళ్లికి హాజరుకానున్నారు. ఇటీవలే, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసిన నితిన్.. శుభలేఖ అందజేసి పెళ్లికి ఆహ్వానించారు. అలాగే, తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా నితిన్ ఆహ్వానం పంపినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా పెళ్లికి హాజరవుతారని అంటున్నారు. పవన్‌తో పాటు వరుణ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా ఆహ్వానం అందిందని తెలిసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30G49OY
v

No comments:

Post a Comment