గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొణిదెల విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన స్టైలిష్ స్టార్ సతీమణి అల్లు స్నేహారెడ్డి.. పిల్లలు అయాన్, అర్హలతో కలిసి జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం స్నేహారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ భూమిపై మనుషులకు ఎంత పాత్ర ఉందో.. ఇతర జీవాజాలానికి అంతే పాత్ర ఉంది. ప్రకృతి సమతుల్యంగా ఉన్నప్పుడే అందరం ఆనందంగా ఉంటాం’’ అని అన్నారు. ప్రకృతి సమతుల్యంగా ఉండటానికి మొక్కలు నాటడం ఒక్కటే సరైన మార్గమని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ భావించారని స్నేహ అన్నారు. ఇంత మంచి ఆశయంతో ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని స్నేహ ఆకాంక్షించారు. తెలంగాణ మొత్తం పచ్చని నేలగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతుగా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ను విసురుతున్నట్లు తెలిపారు. తన భర్త అల్లు అర్జున్, తన స్నేహితులు జూపల్లి మేఘనారావు (మైహోమ్స్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్), ఆర్. సింగారెడ్డిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు స్నేహ నామినేట్ చేశారు. వీరంతా మొక్కలు నాటి మరికొంత మందిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేయాలని కోరారు. కాగా, ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాలుపంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f030a1
v
No comments:
Post a Comment