ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఎవడో.. థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ యవ్వారం కూడా ఇలాగే ఉంది. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు మారిన రాజుగారు ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీలో చేరి.. నరసాపురం ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో కాని.. పార్టీ నన్నసలు పట్టించుకోవడం లేదు.. ఐ హర్టూ అంటూ కినుక వహించారు ఆర్ ఆర్ ఆర్ (రఘురామకృష్ణంరాజు). అంతటితో ఆగకుండా.. గెలిచిన పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తూ ముఖ్యమంత్రి జగన్తో పాటు.. తన పార్లమెంట్ స్థానంలోకి వచ్చే వైసీపీ ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది అధికార పార్టీ. అంతేకాదు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాజుగారికి వైసీపీ పార్టీ పార్టీ తరుపున షోకాజ్ నోటీసులు పంపితే.. వైసీపీ పార్టీనా ఇదెక్కడ పార్టీ.. నేను ఈ పార్టీమీద గెలవలేదే.. నేను గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటూ వివరణ ఇవ్వాల్సింది పోయి.. షోకాజ్కే షోకాజ్ ఇచ్చి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు ఆర్ఆర్ఆర్. మొత్తానికి వైసీపీలో ఉంటూనే ఆ పార్టీ రెబల్ ఎంపీగా రఘు రామ కృష్ణంరాజుకి చెక్ పెట్టే ఆలోచన ఉన్న వైసీపీ ఆయనతో రాజీనామా చేయించాలని ప్రయత్నిస్తూనే.. దమ్ముంటే సింగిల్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నేను రాజీనామా చేస్తా.. ముందు నా పార్లమెంట్ నియోజక వర్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనండి.. అప్పుడు నేను రాజీనామా చేయడానికి రెడీ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారాయన. ఇక ఎంపీ-ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదరడంతో ఒకరిపై ఒకరు కోర్టు నోటీసులు, పార్టీ షోకాజ్లు దాటేసి కేసులుపెట్టుకునే వరకూ వెళ్లింది. ఆ జిల్లా మంత్రిగా ఉన్న రంగనాథ రాజుతో పాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం రఘురామ క్రిష్ణం రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి రఘురామకృష్ణంరాజు నరసాపురంలో రెబల్గా మారడంతో ఈరోజు కాకపోతే రేపటి రోజైనా అక్కడ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రావడం ఖాయం అని హాట్ టాపిక్ నడుస్తుండటంతో ఈ ఇష్యూపై స్పందిస్తూ ప్రముఖ కమెడియన్, వైసీపీ నాయకుడు, మాజీ ఎస్వీబీసీ చైర్మన్ థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నరసాపురంలో బై ఎలక్షన్స్ వస్తే ఆ సీటు నాదే.. ఎంపీ నేనే అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గెలుపు కోసం త ఎన్నికల్లో పగలూ రాత్రి కష్టపడ్డాం. ఇప్పుడు ఆయనే ఎంపీగా ఉన్నారు. కాని ఆయన ఇప్పుడు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ.. వాడు అలాంటోడు.. వీడు ఇలాంటోడు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ పెద్ద వాళ్ల విషయాలు.. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. భిన్న స్వరాలు ఉన్నాయి. నరసాపురంలో బై ఎలక్షన్స్ వస్తే.. తప్పకుండా నేను బరిలో నిలబడతా.. మీ మీడియా అంతా నాకు సపోర్ట్ చేయాలి. నేను జగన్ గారిని అడిగి టికెట్ తెచ్చుకుంటా.. టికెట్ తెచ్చుకోవడమే కాదు గెలుస్తాను కూడా’ అంటూ శపథం చేస్తున్నారు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ. ఎంతో మంది పోటీ పడ్డా.. పార్టీ కోసం కష్టపడ్డాడనే కృతజ్ఞతతో వైఎస్ జగన్.. థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీని టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ని చేస్తే.. వెనకనుంచి పట్టుకుంటా అని మధ్యలోనే ఆ పదవి పోగొట్టుకుని ఇప్పుడు నరసాపురం ఎంపీని నేనౌతా.. జగన్ని అడిగి ఎంపీ సీటు తెచ్చుకుంటా అనడం హాస్యాస్పదమే సుమీ. అయినా అక్కడ ఉప ఎన్నిక జరగాలంటే ముందు జరగాల్సిన వ్యవహారం చాలా ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడ్ని తొలగించాలన్నా.. ఆయన రాజనామా చేయాలన్నా.. అక్కడ తిరిగి ఉప ఎన్నిక జరగాలన్నా వెంటనే అయిపోయే పనికాదు. అవన్నీ పూర్తయ్యాక.. పార్టీ పెద్దలు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీకి అవకాశం ఇస్తారేమో ఆయన ఆశ తీరుతుందేమో చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30F1qVZ
v
No comments:
Post a Comment