Monday, 27 July 2020

రియల్ హీరోగా మారిన విలన్.. మరి, మన హీరోలు!?

సోనూ సూద్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ‘సూపర్’ సినిమాతో గుర్తింపుతెచ్చుకుని.. ‘అరుంధతి’లో పసుపతి పాత్రలో జీవించి స్టార్ డమ్ సంపాదించిన నటుడు ఆయన. ఆ సినిమా తరవాత తెలుగులో వరుస పెట్టి విలన్ పాత్రలు చేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషల్లో బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. సినిమాలే కాకుండా ముంబైలో హోటల్ బిజినెస్‌ కూడా ప్రారంభించారు. రెండు చేతులా సంపాదించే తన సంపాదనలో చాలా మొత్తం సామాజిక సేవకే వాడుతున్నారు. ఆయన సామాజిక సేవ గురించి ఈ లాక్‌డౌన్ సమయంలో దేశ ప్రజలందరికీ తెలిసింది. కరోనా మహమ్మారి విజృంభించిన వేల దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో ముంబైలో చిక్కుకుపోయిన వలస కూలీల పొట్ట నింపారు సోనూ సూద్. పేదల ఆకలి తీర్చారు ఈ వెండితెర విలన్. ముంబైలోని తన హోటల్‌ను హెల్త్‌కేర్ వర్కర్స్‌కు వసతి కింద వాడుకోమని ఇచ్చేశారు. అంతేనా.. పంజాబ్‌లోని డాక్టర్లకు 1500 పీపీఈ కిట్లను అందజేశారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేసి ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు వలస కూలీలను పంపారు. ఇక, కొచ్చి నుంచి ప్రత్యేక విమానంలో ఒడిశా వలస కూలీలను భువనేశ్వర్‌కు తరలించారు. ప్రభుత్వ సహకారంతో విదేశాల నుంచి ఎంతో మందిని రప్పించారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో విశేష సేవలందించి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. Also Read: ఇదంతా ఒక ఎత్తయితే.. తాజాగా సోనూ సూద్ చేసిన ఒక మంచి పని ఆయనపై గౌరవాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోనూ సూద్‌ను రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ మంచి పనేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తన ఇద్దరి కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నడాన్ని వీడియో రూపంలో ట్విట్టర్‌లో చూసిన సోనూ సూద్ చలించిపోయారు. ఆ రైతుకు కొన్ని గంటల వ్యవధిలో ట్రాక్టర్ కొని పంపించారు. సోనూ సూద్ చొరవకు, మంచి తనానికి ప్రశంసల వర్షం కురిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి సోనూ సూద్‌ను అభినందించారు. ఇక టాలీవుడ్‌కు చెందిన దర్శకులు, కొంత మంది నటులు కూడా సోషల్ మీడియా ద్వారా సోనూ సూద్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నెటిజనులు అయితే సోనూ సూద్‌ను రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఆయనలాంటి మంచి మనిషి యావత్తు భారత సినీ పరిశ్రమలో లేరని కొనియాడుతున్నారు. అయితే, ఇదే సమయంలో మన తెలుగు హీరోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు ట్రాక్టర్ అందించడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ మన తెలుగు హీరోలు ఏం చేశారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకునే స్టార్ హీరోలు కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ఆక్షేపిస్తున్నారు. తెలుగు వాడు కాకపోయినా సోనూ సూద్ పెద్ద మనసుతో తెలుగు ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారని.. కానీ, మన తెలుగు హీరోలకు మాత్రం పట్టడంలేదని విమర్శిస్తున్నారు. సోనూ సూదే అసలుసిసలు కథానాయకుడు అని కొనియాడుతున్నారు. నిజానికి మన స్టార్ హీరోలు కూడా కరోనా సమయంలో ప్రజలకు సాయం అందించారు. కాకపోతే సోనూ సూద్ చేసిన సాయం ముందు ఆ సాయం కనిపించడంలేదు. టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు తమ వంతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌లకు, ప్రధాన మంత్రి సహాయ నిధికి, తెలుగు సినీ పరిశ్రమలో నెలకొల్పిన కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’కు విరాళాలు ఇచ్చారు. తమ సిబ్బందిని ఆర్థికంగా ఆదుకున్నారు. కానీ, సోనూ సూద్ చేసినట్టు ఆ స్థాయిలో పనిచేయలేదు. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hJ2mjg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...