బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య పెను సంచలనంగా మారింది. జూన్ 14వ తేదీన తన ఇంట్లోనే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం సినీ వర్గాలను కలచివేసింది. టాలెంటెడ్ యాక్టర్ మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోయారు. కాగా సుశాంత్ జ్ఞాపకాలు నేటికీ మరచిపోలేక పోతున్నానని పేర్కొంటూ తాజాగా హీరోయిన్ చావ్లా భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టింది. `ధోనీ` సినిమాలో సుశాంత్తో కలిసి నటించింది భూమిక. ఈ మూవీలో భూమిక, సుశాంత్ అక్కాతమ్ముళ్లుగా నటించారు. ఆ ఒక్క సినిమాతోనే సుశాంత్తో మంచి అనుబంధం ఏర్పర్చుకుంది భూమిక. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని ఆమె నేటికీ నమ్మలేకపోతోందట. తాజాగా సుశాంత్ మరణంపై ఓ భావోద్వేగ లేఖను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది భూమిక. Also Read: ''దాదాపు 20 రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నాను. నీతో కలిసి పనిచేసింది ఒక్క సినిమాలోనే అయినా ఇప్పటికీ మరచిపోలేకపోతున్నా. అవును సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అంత సులువైన విషయం కాదని నేను అంగీకరిస్తున్నా. ఈ ప్రపంచంలో మనల్ని గౌరవించే వారితో పాటు వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళను పక్కనబెట్టి ముందుకు సాగినపుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదేమైనా గుడ్ బై సుశాంత్.. నువ్వెక్కడున్నా నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నా'' అని తన లేఖలో రాసింది భూమిక.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dVW25r
v
No comments:
Post a Comment