Friday, 26 June 2020

పవర్ బిల్ చూసి షాక్ తిన్న హీరోయిన్

ఈ మధ్య అధికారులు పంపిస్తున్న పవర్ బిల్లులు.. సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా షాక్‌ ఇస్తున్నాయి. తాజాగా హీరోయిన్‌కు పవర్ బిల్లు చూసి షాక్ తగిలింది. తెలుగు, తమిళంలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరొందిన నటి కార్తీక నాయర్‌. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఈ అమ్మడు జత కట్టింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ అంటూ అల్లరి నరేష్ సినిమాలో కూడా నటించింది. అయితే ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలతో అలరించని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ముంబై ఇంటి కరెంట్ బిల్లుని షేర్ చేస్తూ.. బిల్లు చూసి షాక్ అయ్యానని కామెంట్ పెట్టింది కార్తీక. ముంబయిలోని కార్తీక ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. లాక్‌డౌన్ వలన గత రెండు నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల డైరెక్ట్ గా బిల్లు పంపించారు. ఆ బిల్లులో లక్ష రూపాయలు ఉండటం చూసి షాక్ అయ్యానని తెలిపింది కార్తీక. ఇది నా హోటల్ బిల్లు కంటే ఎక్కువగా ఉంది. నా ఇంటికి కరెంట్ బిల్లు అంతగా ఎలా వచ్చింది అంటూ ఆమె సోషల్ మీడియాలో అదానీ గ్రూప్ ను ప్రశ్నించింది. మినిమం పవర్ వాడకుండానే అంత బిల్లు ఎలా వచ్చిందో మీరే చెప్పాలంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ నిలదీసింది. ఆ మధ్య హీరోయిన్ స్నేహ భర్తకు కూడా ఇలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు షాక్ ఇచ్చారు. స్నేహ భర్త, నటుడు ప్రసన్న ఇంటికి డెబ్బై వేల కరెంట్ బిల్లు పంపించారు అధికారులు. దీనిపై అతడు స్పందిస్తూ విద్యుత్ సంస్థ దోపీడీ చేస్తోందని మండిపడ్డారు. తనకు రెండు కనెక్షన్స్ ఉన్నాయని, అయినా ఇంత మొత్తంలో బిల్లు రాదని ఆయన చెప్పుకొచ్చాడు. వీటిపై సదరు అధికారులు కూడా స్పందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31iYsIL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...