Friday, 5 June 2020

క్రేజీ స్టెప్ దిశగా రష్మిక మందన.. ఇకపై సొంతంగానే! ఫ్యాన్స్ ఫిదా అయ్యే ప్లాన్..

'ఛలో' అంటూ తెలుగు చిత్రసీమకు పరిచయమై ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది కన్నడ భామ . ఆమె అందం, అభినయం తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్కివ్వడంతో వరుస అవకాశాలు దక్కాయి. దీంతో స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించి భేష్ అనిపించుకున్న ఆమె.. ఈ సారి క్రేజీ స్టెప్ వేసేందుకు రెడీ అయిందట. ఇకపై తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునేలా ప్లాన్ చేస్తోందట రష్మిక. ఈ మేరకు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిందని సమాచారం. గత రెండు నెలలకు పైగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న ఆమె తెలుగు పదాలను స్పష్టంగా పలకడంపై పట్టు సాధించిందట. త్వరలోనే సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధంగా ఉందట. తన లేటెస్ట్ మూవీ ''లో అభిమానులకు సొంత వాయిస్ వినిపించి ఫిదా చేయాలని ఫిక్స్ అయిందట. ఈ క్రమంలోనే చిత్రంలోని తన డైలాగులని తీసుకుని ఇప్పటికే ఫుల్ ప్రాక్టీస్ చేసేసిందట రష్మిక. Also Read: సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్‌ని అతిత్వరలో తిరిగి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XAWgtO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...