Friday, 26 June 2020

మాహిష్మతి రాజ్యంలో మాస్కులు మస్ట్ అంటూ జక్కన్న వీడియో.. భీం ఎక్కడంటూ ఫ్యాన్స్ అసహనం

కరోనా అవగాహన కల్పించేందుకు మరో క్రియేటివ్ వీడియోను షేర్ చేశారు దర్శకధీరుడు . కరోనాను అరికట్టేందుకు మాస్క్ వినియోగం, వాటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఆయన దర్శకత్వం వహించిన వరల్డ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి’ చిత్రంలోకి వీడియో క్లిప్పింగ్‌ను రిలీజ్ చేశారు రాజమౌళి. ‘మాహిష్మతి రాజ్యంలోనూ మాస్క్‌లు తప్పనిసరి’ అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడు-బహుబలి మధ్య హోరా హోరీ ఫైర్ సీట్‌లో ఇద్దరి ముఖాలకు మాస్క్ పెట్టి క్రియేటివిటీ చూపించారు రాజమౌళి వీఎఫ్ఎక్స్ టీం. ఈ సందర్భంగా ప్రభాస్, రానా ఫేస్‌లకు మాస్క్ పెట్టి అద్భుతంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన అవినాష్ అండ్ టీంను అభినందించారు రాజమౌళి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం రాజమౌళి భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘’ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కీలకదశలో ఉన్న సమయంలో కరోనా రావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు టీజర్‌ను విడుదల చేశారు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ బర్త్ డేకి కొమరం భీం టీజర్ ఉంటుందని ఆశ పడగా.. ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు జక్కన్న. అప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ‘మాహిష్మతి రాజ్యంలోనూ మాస్క్‌లు తప్పనిసరి’ అంటూ జక్కన్న ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో.. ‘అయ్యా!! మా కొమరం భీం అప్డేట్ ఇవ్వండి’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దండాలు, ఏడుస్తున్న ఎమోజీలతో ప్రాధేయపడుతున్నారు. చూడాలి మరి జక్కన్న కనుకరించి కొమరం భీం అప్డేట్ ఇస్తారేమో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YBIO9q
v

No comments:

Post a Comment