కరోనా కారణంగా వచ్చిన ఈ లాక్డౌన్ ఎన్నెన్నో కొత్త పరిణామాలకు ఊతమిచ్చింది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. థియేటర్స్ మూతపడటంతో దర్శకనిర్మాతలు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరుగుతోందని రిపోర్ట్స్ వస్తుండటంతో అందరి చూపు వాటిపైనే పడుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, క్రిష్ లాంటి సీనియర్ డైరెక్టర్లు సైతం ఓటీటీ వేదికలపై సినిమాలు రూపొందిస్తుండగా, తాజాగా యంగ్ డైరెక్టర్ కూడా అదే బాటలో వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు సినిమాలు చేసినా థియేటర్స్ లేవు.. అసలు ఈ ఏడాది థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా జనం ఆ థియేటర్స్ కి వస్తారనే నమ్మకం లేదు. మరోవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం, రకరకాల హోమ్ థియేటర్స్ అందుబాటులోకి రావడంతో అంతా ఇంట్లోనే వినోదం పొందేందుకు ఇష్టపడుతున్నారు. ఇది గమనించిన అనిల్ రావిపూడి దిశగా అడుగులేస్తున్నారట. Also Read: తన రెగ్యులర్ ఫార్మాట్ అయిన కామెడీ పండిస్తూ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట అనిల్. అల్లు అరవింద్ ఆహా డిజిటల్ ప్లాట్ఫామ్లో దీనిని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు'తో వెండితెర వినోదం పంచిన అనిల్.. ప్రస్తుతం ఎఫ్ 3తో పాటు రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఆ కథలు రెడీ చేస్తూనే టెక్నాలజీని ఏ మేర క్యాచ్ చేసుకుంటాడో!
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3831YbC
v
No comments:
Post a Comment