సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఆయన కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ఈ 14వేల మంది కార్మికుల్లో 12 వేల మంది సినీ , 2 వేల మంది టీవి కార్మికులు ఉన్నారు. వీరందరికీ నిత్యావసరాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అక్కినేని నాగార్జున, ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయికిరణ్, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయి కిరణ్, ఎన్.శంకర్, సి.కళ్యాణ్ చేతుల మీదుగా కార్మిక యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా తలసాని సాయి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ కరోనా మహమ్మారి వల్ల అందరూ ఉపాధి కోల్పోయారు. పని లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని సీఎం ఇచ్చిన పిలుపు మేరకు సినీ కార్మికులు అందరికీ, 24 క్రాఫ్ట్లకు చెందిన వారికి దాదాపు 14 వేల నిత్యావసరాల కిట్స్ అందజేస్తున్నాం. 20 రోజులకు సరిపడా సరుకులతో ఈ కిట్స్ తయారుచేశాం. ఇవి ఇంటింటికే వెళ్లి అందజేయాలని వాటిని ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్లకు అప్పగించాం’’ అని వెల్లడించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2M9RwVm
v
No comments:
Post a Comment