దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, నటుడు రానా దగ్గుబాటి వివాహం మిహీకా బజాజ్తో జరగనుంది. ఈ మేరకు పెద్దలు నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు. రానా, మిహీకాల వివాహాన్ని ఖాయం చేస్తూ ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రోకా ఫంక్షన్ను బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో నిర్వహించారు. ఈ వేడుకలో దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపాటు, మిహీకా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత విచ్చేశారు. See Photos: రానా ఇటీవల తన ప్రేయసి మిహీకాను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన విషయం తెలిసిందే. తనతో పెళ్లికి ఆమెకు అంగీకరించారని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పరోక్షంగా వెల్లడించారు రానా. తన పెద్ద కుమారుడు వివాహాన్ని త్వరలోనే జరపనున్నట్టు నిర్మాత సురేష్ బాబు కూడా స్పష్టం చేశారు. అయితే, బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో రానా, మిహీకా నిశ్చితార్థం జరగనున్నట్టు వదంతులు వచ్చాయి. వీటిని సురేష్ బాబు కొట్టిపారేశారు. నిశ్చితార్థం ఏమీ జరగడం లేదని, ఇరు కుటుంబాల పెద్దలం కలుసుకుంటున్నామని అన్నారు. Also Read: సురేష్ బాబు చెప్పినట్టుగానే కాబోయే వధూవరుల కుటుంబాలు బుధవారం సాయంత్రం కలుసుకున్నాయి. రానా, మిహీకాల పెళ్లిని అధికారికంగా నిశ్చయించుకున్నాయి. దీన్నే ఉత్తర భారతదేశంలో రోకా వేడుక అంటారు. ఈ వేడుకను కూడా సురేష్ బాబు గ్రాండ్గా జరిపారు. వియ్యంకుల వారికి పసందైన విందును ఏర్పాటు చేశారు. వారికి ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించారు. ఈ వేడుకలో వెంకటేష్ ఫ్యామిలీ, అక్కినేని నాగచైతన్య, సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి ఫొటోలు ఆసల్యంగా బయటికి వచ్చాయి. కాగా, త్వరలోనే రానా, మిహీకాల నిశ్చితార్థం జరగనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2APSB2u
v
No comments:
Post a Comment