తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూడటానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే ఆ రకమైన కథలనే సిద్ధం చేస్తూ ప్రేక్షకుల ముందుంచుతున్నారు దర్శకనిర్మాతలు. హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్కమింగ్ మూవీలో మెగా మేనల్లుడు ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది. Also Read: ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ఒకటి త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సాయి ధరమ్ తేజ్ను తీసుకున్నారని తెలుస్తోంది. కథను మలుపు తిప్పే ఈ పాత్ర కోసం చాలా మంది హీరోలను పరిశీలించిన పిమ్మట ఫైనల్గా సాయి ధరమ్ తేజ్ అనుకున్నారట. లాక్ డౌన్ ఫినిష్ కాగానే ఈ విషయమై అధికారిక ప్రకటన జారీ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్ ఎలాంటి రెమ్మ్యూనరేషన్ కూడా డిమాండ్ చేయలేదనే మరో సమాచారం షికారు చేస్తోంది. మల్టీస్టారర్ చేయడానికి ఓకే గానీ, డబ్బు విషయాలు ఇప్పుడు డిస్కస్ చేయనని అన్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతున్న ప్రస్తుత పరిణామాల్లో నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే ఆయన రెమ్మ్యూనరేషన్ గురించి మాట్లాడలేదని అంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g2ndh4
v
No comments:
Post a Comment