Friday, 22 May 2020

చిక్కుల్లో అనుష్క.. లీగల్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు ఎప్పుడు, ఏ రూపంలో, ఎలాంటి చిక్కు వచ్చిపడుతుందో ఊహించడం కష్టం. షూటింగ్ మొదలుకొని సెన్సార్, సినిమా రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పించే దాకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సినిమా విడుదలయ్యాక ఏ వర్గం నుంచీ ఎలాంటి అభ్యంతరాలు రాలేదంటే సేఫ్.. లేదంటే ఇక రచ్చ రచ్చే. లీగల్ నోటీసులు, మూవీ ప్రదర్శన ఆపేయాలని గొడవలు ఇవ్వన్నీ నడుస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు అలాంటి చిక్కే ఎదురైంది. ఆమె స‌హ న‌ర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన `ప‌తాల్ లోక్‌` వెబ్ సిరీస్ నేపాలీల‌ను కించ‌ప‌రిచేలా ఉందంటూ కొందరు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 18న విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్నీ మూతపడటంతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లకు‌ డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాచ్ చేసుకుంటూ పలువురు దర్శకనిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సహ నిర్మాతగా రిలీజైన `ప‌తాల్ లోక్‌` వెబ్ సిరీస్ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌లోని రెండ‌వ ఎపిసోడ్‌లో నేపాలీల‌ను కించ‌ప‌రిచేవిధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని పేర్కొంటూ నేపాల్‌కి చెందిన గోర్ఖా క‌మ్మూనిటీ ఫిర్యాదు చేసింది. దీంతో `ప‌తాల్ లోక్‌` యూనిట్‌తో పాటు అనుష్క శర్మకు కూడా లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీనిపై అనుష్క ఇంకా స్పందించలేదు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36ljAP3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...