Friday, 15 May 2020

రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడి మృతి.. శంకర్ తీవ్ర ఆవేదన

తమిళ దర్శకుడు ఏవీ అరుణ్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన అరుణ్.. శుక్రవారం ఉదయం కోయంబత్తూర్ జిల్లాలోని మెట్టుపాల్యం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తన సొంతూరు అన్నూర్ నుంచి బైక్‌పై బయలుదేరిన అరుణ్.. మెట్టుపాల్యం సమీపంలో లారీని క్రాస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అరుణ్ మృతి పట్ల దర్శకుడు శంకర్‌తో పాటు, ఇండస్ట్రీకి చెందిన సహచరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ మృతికి సోషల్ మీడియా ద్వారా వారు సంతాపం తెలియజేశారు. అరుణ్‌ మంచితనం, వృత్తి పట్ల ఆయనకు ఉన్న గౌరవం గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమకు దూరమయ్యాడని ఇండస్ట్రీలోని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు, అరుణ్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యామని అంటున్నారు. Also Read: అరుణ్ మృతి పట్ల డైరెక్టర్ శంకర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘యువ దర్శకుడు, నా మాజీ అసిస్టెంట్ అరుణ్ ఆకస్మిక మరణం నా గుండెను కలచివేస్తోంది. నీ మంచి తనం, సానుకూలత, కష్టపడేతత్వం నాకెంతో ఇష్టం. నీ కోసం ఆ దేవుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. నీ కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. జీవీ ప్రకాష్ కుమార్, గాయత్రి సురేష్‌లను ప్రధాన పాత్రధారులుగా చేసుకుని ‘4G’ అనే సినిమాను అరుణ్ రూపొందించారు. అయితే, ఆ సినిమా కొన్ని కారణాల చేత ఇంకా విడుదలకాలేదు. ఆ సినిమాను ఎలా అయినా విడుదల చేయాలని నిర్మాత సీవీ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో అరుణ్ మృతి చెందడం బాధాకరం. తనతో పనిచేసిన అరుణ్ మృతి పట్ల నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా స్పందించారు. అరుణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘‘వెంకట్ పక్కర్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. ఆయనెప్పుడూ పాజిటివిటీని వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని జీవీ ప్రకాష్ కుమార్ తమిళంలో ట్వీట్ చేశారు. ‘4G’ సినిమా కోసం అరుణ్ తన పేరును వెంకట్ పక్కర్‌గా మార్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T8arnL
v

No comments:

Post a Comment