Tuesday, 19 May 2020

నాథూరాం గాడ్సేపై నాగబాబు కామెంట్స్.. పాపం! అంటూ వరుస ట్వీట్స్‌తో సంచలనం

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు ట్వీట్ చేశారు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం అంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఒక్కసారిగా వైరల్ అయిన ఈ ట్వీట్ చూసి సినీ, రాజ్జకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ''ఈ రోజు పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం అధికార ప్రభుత్వానికి లోబడి మీడియా పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)'' అంటూ సంచలన ట్వీట్ చేసిన ఆయన ఆ వెంటనే దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు. Also Read: ''గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'' అని ట్వీట్ చేస్తూ నాథూరాం గాడ్సే పిక్ షేర్ చేశారు నాగబాబు. ఆయన చేసిన ఈ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. నాగబాబు చేసిన ఈ ట్వీట్స్ వెనుక ఏదో పెద్ద స్కెచ్చే ఉందనే వాదన వినిపిస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tk0xzl
v

No comments:

Post a Comment