Tuesday, 12 May 2020

ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్స‌ర్‌‌తో నటుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ ఈ వరుస మరణాలు ఇండస్ట్రీని షాక్‌కి గురిచేస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి, తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణ‌వేణి, కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, బాలీవుడ్ ప్రముఖులు కుల్మీత్ మక్కర్, రంజిత్ చౌదరి, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, మలయాళ యువ నటుడు బేసిల్ జార్జ్‌లు వివిధ కారణాలతో మరణించగా.. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్(44)‌ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న సోమవారం నాడు మరణించారు. మిమిక్రీ కళాకారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్.. నటుడిగా సత్తా చాటారు. ముల్లా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన.. ‘ప్రేమమ్ 2’ ‘క్రేజీ గోపాలం’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించారు. రెండేళ్ల క్రితం క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్ కొడుకు మరణించడంతో బాగా కుంగిపోయారు.. అప్పటి నుంచి సినిమాలు బాగా తగ్గించేసిన క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్‌కు క్యాన్సర్ రావడంతో కోలుకోలేకపోయారు. క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్ మరణ వార్తతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కుటుంబానికి ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AnJO7F
v

No comments:

Post a Comment