Friday, 22 May 2020

చక్రి సోదరుడు మహిత్ స్వరపరిచిన కరోనా పాటను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను కొనియాడుతూ ప్రముఖ గేయ రచయిత బాలాజీ రాసిన పాటకు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రముఖ గాయనీ గాయకులు మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతామాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, విలేజ్ సింగర్ బేబీ పాడిన ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘10 మంది గాయనీ గాయకులు పాట పాడిన తీరు, బాలాజీ గారి రచన, మహిత్ నారాయణ్ గారి సంగీతం చాలా బాగుంది. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ పాట రాయడం మరింత స్ఫూర్తిదాయకం. ఈ పాట కోసం పని చేసిన టీమ్ మెంబర్స్‌‌కి అల్ ది బెస్ట్’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలకు ప్రతి ఒక్కరు చేతులెత్తి మొక్కాలి. వారి గురుంచి పాట చేయడం.. ఆ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు లాంచ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. నా మిత్రుల సహకారంతో ఈ పాటను చెయ్యగలిగాను. నాకు సహకరించిన గాయనీ గాయకులకు, మిత్రులు ప్రభాకర్, రాజుకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zlBiWz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...