Thursday, 28 May 2020

టాలీవుడ్ పెద్దల భేటీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దల భేటీపై హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని బాలకృష్ణ అన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. Also Read: ఈ సందర్భంగా లాక్‌డౌన్ సమయంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయంట. నాకు తెలీదు ఆ విషయం. నాకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా తెలిసింది చర్చలు జరుగుతున్నాయని. ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలీదు. త్వరలోనే షూటింగ్‌లు మొదలుపెడితే మంచిదే. కాకపోతే, ఏ రకంగా మొదలుపెడతారు అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రభుత్వం నుంచి ఒక జీవో రావాలి. ఆ జీవో రాగానే జూన్ రెండో వారమో, మూడో వారమో షూటింగ్‌లు మొదలవుతాయి అంటున్నారు’’ అని బాలయ్య అన్నారు. Also Read: ఇప్పటికే షూటింగ్‌లు ప్రారంభమై ఆగిపోయిన చిత్రాలకు ముందుగా అనుమతి ఇవ్వాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తక్కువ సిబ్బందితో షూటింగ్‌లు చేస్తూ సామాజిక దూరం పాటించాలని బాలయ్య సూచించారు. కాగా, ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల గురించి తనకు తెలీదన్న బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే తరవాతి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36A4k0K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...