పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘’. మేఘన, లక్కి హీరోయిన్స్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్స్కి మంచి స్పందన వచ్చింది. ఈ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. లాక్డౌన్ కారణంగా మిగిలిన షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ సినిమా థీమ్ పోస్టర్ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. Also Read: ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటివరకు చిత్రీకరించిన మేరకు ఔట్ఫుట్ చాలా బాగా వచ్చింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. మా దర్శకుడు అభిరామ్ మంచి విజన్తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు’’ అని అన్నారు. Also Read: ‘జెస్సీ’, ‘ఓ పిట్టకథ’ సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ ఈ చిత్రానికి పనిచేస్తున్నట్టు నిర్మాత వెల్లడించారు. ఆయన అందించిన విజువల్స్ చిత్రానికి హైలైట్ అవుతాయని అన్నారు. అలాగే, ‘ఆర్ఎక్స్ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని చెప్పారు. చివరి షెడ్యూల్ పూర్తి అవగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం సమకూరుస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XlSlQc
v
No comments:
Post a Comment