Wednesday, 6 May 2020

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. నిన్న సమంత నేడు చిరంజీవి!! బడా స్టార్స్ పక్కా ప్లాన్

రోజులు గడుస్తున్నా కొద్దీ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. పాతరోజులు పోయి కొత్తరోజులు వస్తున్నాయి. ఈక్రమంలో అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమను టెక్నాలజీ బాగా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, క్రమంగా ఇంటర్నెట్ వాడకం పెరగడం, ‘అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా’ వంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి డిమాండ్ రావడం లాంటి పరిణామాలు నటీనటుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు ఇంట్లోనే ఉండి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. దీంతో వెబ్ సిరీస్‌లు చేసి అలరించేందుకు సిద్ధమవుతున్నారు సినీ తారలు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కియారా అద్వానీ, కాజల్, లాంటి స్టార్స్ ఈ వైపుగా అడుగులేయగా ఇప్పుడు కూడా అదే బాటలో వెళ్లాలని చూస్తున్నారట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ మూవీ తరువాత చేయబోయే సినిమాల గురించి చిరంజీవి పక్కా ప్లాన్స్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే సుజీత్, బాబీ, మెహర్ రమేష్ సినిమాలను లైన్‌లో పెట్టేసిన ఆయన.. ఓ వెబ్ సిరీస్ లోనూ నటించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. Also Read: ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నిర్మించబోయే వెబ్ సిరీస్ చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారనేది ఫిలింనగర్ టాక్. చిరంజీవితో వెబ్‌ సిరీస్‌ తీసేందుకు చర్చలు జరిగిన మాట వాస్తవమే అని ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాం వర్గాలు చెబుతున్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా? లేదా? అనేది మాత్రం లాక్‌డౌన్‌ తర్వాతే తేలుతుందని వారు అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే నేటితరం ప్రేక్షకులకు దగ్గరవుతూ యువ హీరోలకు గట్టిపోటీ ఇచ్చేందుకు చిరంజీవి పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xG5ZVA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...