Sunday, 3 May 2020

బన్నీ చాలా ఎంకరేజ్ చేస్తారు.. నానికి వినయం ఎక్కువ: రాశీ ఖన్నా

లాక్‌డౌన్ టైమ్.. సినీ తారలంతా ఇంట్లో ఖాళీగానే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. వంట గదిలో ప్రయోగాలు చేస్తున్నారు. వీటన్నిటినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కొంత మంది స్టార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. మరికొంత మంది ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా చార్మింగ్ బ్యూటీ రాశీ ఖన్నా ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి కాసేపు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే, ఈ ఇంటరాక్షన్‌లో రాశీ ఖన్నా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆమె చెప్పిన మాటలు ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టకున్నాయి. అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి అని ఒక అభిమాని అడగగానే.. ‘‘ఆయన చుట్టూ ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రోత్సహిస్తుంటారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించడం కూడా ఎంతో ఇష్టం’’ అని రాశీ చెప్పుకొచ్చారు. అలాగే, మహేష్ బాబుతో కలిసి పనిచేయాలని తాను వేచిచూస్తున్నానని.. త్వరలోనే తన కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు ‘తొలిప్రేమ’ అంటే ఎంతో ఇష్టమన్నారు. తమిళంలో తనకు ఇష్టమైన నటుడు దళపతి విజయ్ అని చెప్పారు. అలాగే, తెలుగులో ఇష్టమైన హీరోయిన్ సమంత అని వెల్లడించారు. హీరో నాని చాలా వినయంగా ఉంటారని, వెరీ టాలెంటెడ్ అని రాశీ ప్రశంసించారు. ప్రస్తుతం తాను తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఒకటి ‘అరన్మనై 3’ కాగా, మరొకటి హరి దర్శకత్వంలో సూర్య సరసన చేస్తున్నానని తెలిపారు. తెలుగు సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, లాక్‌డౌన్ ముగియగానే స్పష్టత ఇస్తానని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ymAccD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...