ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన మాట్లాడిన తీరును తప్పుబడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఎంతోమంది కర్ణాటక సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ నిరసనకు దిగారు కర్ణాటక సంగీతకారులు. తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కమల్ హాసన్ త్యాగరాజ స్వామిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు చర్చించిన ఆయన.. త్యాగరాజ స్వామిని ఉద్దేశిస్తూ `రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు` అని వ్యాఖ్యానించారు. ''సినిమా అంటే టిక్కెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారం. ఇది ఛారిటీ కాదు. త్యాగరాజ స్వామిలా తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదు'' అన్నారు కమల్. దీంతోత కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కమల్ అలా మాట్లాడటం సరికాదని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అని కోరుతూ సంగీతకారుడు పాల్ఘాట్ రామ్ప్రసాద్ ఆన్లైన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్కు మద్దతుగా ఇప్పటికే 16వేల మంది సంతకాలు చేయడం గమనార్హం. చూడాలి మరి ఈ వివాదంపై కమల్ హాసన్ ఎలా స్పందిస్తారనేది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bh52Rh
v
No comments:
Post a Comment