లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. అనవసరంగా ఏ ఒక్కరూ బయటకు వెళ్ళొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో హీరోహీరోయిన్స్ అంతా ఇళ్లకే పరిమితమై వారి వారి కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తమ సతీమణి కోసం కొందరు వంట చేస్తుంటే, మరికొందరు ఇంట్ పనుల్లో ఆసరా అవుతూ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే తన భర్త మాత్రం అలాంటి పనులేవీ చేయడం లేదని అంటోంది . బాలీవుడ్ చిత్రాల్లో సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్గా కీర్తించబడుతున్న కాజోల్.. 20 ఏళ్ల క్రిందటే అదే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ని ప్రేమించి పెళ్లాడింది. అప్పటి నుంచి అన్యూన్య దాంపత్య జీవితం కొనసాగిస్తున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం కుటుంబమంతా కలిసి హాయిగా గడుపుతోంది. అయితే లాక్డౌన్ రావడంతో తనకు ఇష్టమైన వంటకాలు చేయమని తన భర్తను ఇంతా అడిగినా అస్సలు చేసిపెట్టడం లేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజోల్. లాక్డౌన్ మొదలైనప్పట్నుంచే వంట చేయమని అంటున్నా ఆయన పట్టించుకోవడం లేదని, కనీసం కిచెన్ రూమ్లోకి కూడా వెళ్లడం లేదని తెలిపింది కాజోల్. అయితే ఈ లాక్డౌన్లో తాను మాత్రం తనకు ఇష్టమైన పనులు చేస్తూ, ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నానని చెప్పింది. కరోనా కారణంగా 2020 అయిపోయిందని అనుకోవద్దని, ఇంకా ఏడు నెలల సమయముంది.. ఏదైనా చేసేయొచ్చు, ఎవ్వరూ నిరాశ చెందొద్దని అంటూ అందరికోనూ నూతనోత్సాహం నింపే మాటలు మాట్లాడింది కాజోల్. Also Read: ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా RRRలో నటిస్తున్నారు అజయ్ దేవగన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీలో అజయ్ దేవగన్ రోల్ చాలా కీలకం అని తెలుస్తోంది. ఇటీవలే సెట్స్పై చిత్రయూనిట్ అందరితో కలిసి ఆయన దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి. లాక్డౌన్ కారణంగా RRR షూటింగ్ వాయిదా పడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SwlHtK
v
No comments:
Post a Comment