Wednesday, 13 May 2020

పవన్ సరసన మలయాళీ బ్యూటీ.. దర్శకుడు హరీష్ శంకర్ అసహనం

డైరెక్టర్ హరీష్ శంకర్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌తో మరోసారి జత కట్టిన విషయం తెలిసిందే. 28వ సినిమాకు హరీష్ దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నట్టు ఇటీవల హరీష్ శంకర్ ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో పవన్ సరసన ఎవరు నటించనున్నారనే విషయంపై పలు వార్తలు వచ్చాయి. శృతిహాసన్ అని ఒకరంటే.. కాదు కాదు కాజల్ అగర్వాల్ అని మరికొందరు అన్నారు. Also Read: అయితే, ఇప్పటికే పవన్ 28వ సినిమాలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఈ సినిమాలో మలయాళీ నటి మానస రాధాకృష్ణన్‌ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు ప్రస్తుతం ఒక రూమర్ వైరల్ అవుతోంది. మాసన మలయాళంలో ‘పౌలెట్టంటే వీడు’, ‘బలశాలి’, ‘క్రాస్‌రోడ్స్’, ‘తియాన్’, ‘కాట్టు’, ‘వికడకుమరన్’, ‘ఉరియాడి’ వంటి సినిమాల్లో మానస నటించారు. ఆమె మలయాళంలో పాపులర్ కావడంతో పవన్ సినిమా ద్వారా ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తలో నిజం లేదని స్పష్టమైంది. Also Read: ఈ రూమర్‌పై దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ రూమర్‌లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ రూమర్‌పై ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతున్నానని చెప్పారు. హీరోయిన్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని వెల్లడించారు. స్క్రిప్ట్ పని పూర్తయిన తరవాతే హీరోయిన్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉంది. దీని తరవాత ఆయన క్రిష్ సినిమాను పూర్తిచేయాల్సి ఉంది. ఆ తరవాత హరీష్ శంకర్ మూవీ మొదలవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fNAnOU
v

No comments:

Post a Comment