నేటి తరం నటీనటులు కేవలం సినిమాల్లో నటించడమే కాదు దానికి అనుబంధ రంగాలైన ప్రొడక్షన్స్, డైరెక్షన్, థియేటర్ రంగాల్లో కూడా ప్రతిభ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మెగా పవర్ స్టార్ , సూపర్ స్టార్ సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ని హీరోగా పెట్టి సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట మహేష్ బాబు. ఇప్పటికే అందుకు సంబంధించిన స్కెచ్ రెడీ అయిందని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న RRR ఫినిష్ కాగానే ఈ మూవీ ప్రారంభమవుతుందని ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రానికి వంశీ పైడిపెల్లి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. నిజానికి మహేష్ బాబుతో చేయాలనుకున్న కథనే రామ్ చరణ్తో చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ వంశీ పైడిపెల్లి. ఈ కథ తనకు సూట్ కాదని భావించి రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. ఇదే కథకు రామ్ చరణ్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని వంశీకి రెఫర్ చేశారట. పైగా చెర్రీ అంగీకరిస్తే తానే ఆ సినిమాను నిర్మిస్తానని కూడా చెప్పారట. ఓ వైపు హీరోగా సంచలన విజయాలు దక్కించుకుంటూ మంచి ఫామ్లో ఉన్న మహేష్.. నిర్మాణ రంగంలోనూ స్ట్రాంగ్ అవుతున్నారు. G.మహేష్ బాబు ప్రొడక్షన్ హౌజ్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆయన పలు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతోనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాలని చూస్తున్నారట మహేష్ బాబు. ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ కేటాయించేందుకు రెడీ అయ్యారట. సో.. మంచి స్నేహితులైన రామ్ చరణ్- మహేష్ బాబు కాంబో ఎప్పుడొస్తుందో చూద్దాం మరి!. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2z4gbr9
v
No comments:
Post a Comment