Sunday, 17 May 2020

మెగా ఫాలోయింగ్: 5 లక్షల మార్క్.. తండ్రీకొడుకులు ఒకేలా

నాలుగు దశాబ్దాలకు పైగా వెండితెరపై తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ట్విట్టర్‌లో చేరిన సంగతి తెలిసిందే. తన అభిమానులకు మరింత చేరువయ్యేందుకు, తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో చేరడం అవసరమని భావించిన చిరు.. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని మార్చి 25న ట్విట్టర్‌లో చేరారు. ఆయన వెంటే కుమారుడు రామ్ చరణ్ కూడా మార్చి 26న ట్విట్టర్ ఖాతా తెరిచారు. వీరిద్దరూ ప్రస్తుతం ట్విట్టర్‌లో ఒకేలా దూసుకెళ్తున్నారు. ఒకేలా మెప్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 5 లక్షలు దాటింది. వీరిద్దరూ ఒకేసారి 5 లక్షల ఫాలోవర్ల మార్కును అందుకోవడం విశేషం. అయితే, చరణ్ కన్నా చిరంజీవికి కాస్త ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. వెండితెరపై తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు రామ్ చరణ్. అలాగే, ట్విట్టర్‌లో కూడా రామ్ చరణ్ తన తండ్రిని ఫాలో అవుతున్నారు. అయితే, ట్వీట్ల విషయంలో మాత్రం చిరును అందుకోలేకపోతున్నాయి. ఎందుకంటే, చిరంజీవి ట్వీట్ల విషయంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. Also Read: ట్వీట్ల సంఖ్యలోనూ చిరంజీవిదే పైచేయి. చిరంజీవి 112 ట్వీట్లు చేయగా.. చరణ్ 18 ట్వీట్లు మాత్రమే చేశారు. చరణ్ చాలా సెలెక్టెడ్‌గా ట్వీట్లు చేస్తుంటే.. చిరంజీవి మాత్రం ఈ కరోనా టైమ్‌లో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అలాగే సరదా ట్వీట్లు చేస్తూ నెటిజన్లను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే, చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే ప్రారంభమవుతుంది. అలాగే, రామ్ చరణ్ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ భారీ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్ కూడా ఒక హీరో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bzGXp2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...