Wednesday, 27 May 2020

నా సినిమా ఇప్పుడైతే ‘బాహుబలి 2’ని మించిపోయేది: అమితాబ్

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ భారత సినీ చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులను బద్దలుకొట్టలేక సినిమా ఇండస్ట్రీలో నాన్-బాహుబలి రికార్డులను సృష్టించుకున్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందుకున్న సినిమాపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కామెంట్ చేశారు. తన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఇప్పుడు విడుదలై ఉంటే ‘బాహుబలి 2’ వసూళ్లను మించిపోయేదని అన్నారు. Also Read: అమితాబ్ న‌టించిన అనేక హిట్ చిత్రాల‌లో ‘అమ‌ర్ అక్బర్ ఆంటొని’ ఒక‌టి. ఈ చిత్రం నేటి(మే 27)తో 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అప్పటి ఫోటోలు, సినిమా పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ బాక్సాఫీస్ లెక్కలు కూడా వెల్లడించారు. ‘‘43 ఏళ్లు..!!! ‘అమర్ అక్బర్ ఆంటొని’ అప్పట్లో రూ.7.25 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఇప్పటి లెక్కల ప్రకారం ద్రవ్యోల్బనాన్ని సరిచేస్తే ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ వసూళ్లను ఈ సినిమా దాటేస్తుంది’’ అని అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఒక్క ముంబైలోనే 25 థియేట‌ర్స్‌లో 25 వారాలు ఆడి భారీ క‌లెక్షన్స్ రాబ‌ట్టింది. 1977 మే 27న విడుద‌లైన ఈ సినిమాను 3,62,50,000 మంది చూశారు. అప్పట్లో సగటు టిక్కెట్ రేటు రెండు రూపాయలు. 2017లో ‘బాహుబలి 2’ విడుదలైన సమయంలో టిక్కెట్ రేటు రూ. 150. ఈ రేటు ప్రకారం లెక్కవేస్తే అమితాబ్ మూవీ ఇపుడు రిలీజ్ అయితే రూ. 543 కోట్లు వసూలు చేసేది. ‘బాహుబలి 2’ చిత్రం హిందీ వెర్షన్ ఇండియాలో దాదాపు రూ.510 కోట్లు వసూలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ లెక్కల ప్రకారం ‘బాహుబ‌లి 2’ని ‘అమర్ అక్బర్ ఆంటొని’ బీట్ చేసేదని బిగ్ బి చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c3Z7j7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...